ఇది భారతదేశంలోనే అత్యంత పేద రాష్ట్రం ఇదే.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటంటే..?
భారతదేశంగా మనకు చాలా కాలంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశం అనే ఇమేజ్ ఉంది. కరెన్సీ విలువల్లో మార్పులు, ఆర్థిక, వైద్య, విద్య లాంటి ఇతర అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మనకున్న విస్తారమైన జనాభా పరిమాణం కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశం. ఇక పేదరిక నిర్మూలనకు భారత్ చేస్తున్న కృషిని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. UN అంచనాల ప్రకారం, 2005-2006 మరియు 2019-2021 మధ్య.. మన దేశంలో పేదల సంఖ్య దాదాపు 41.5 కోట్ల మేర తగ్గింది. ప్రపంచ పేదరిక పరిశీలనల ప్రకారం దేశంలో పేదలు 4 కోట్ల లోపు ఉన్నారు. భారతదేశ జనాభా పరిమాణాన్ని బట్టి చూస్తే, పేదరికం సంఖ్య చాలా తక్కువ. ఇది దేశానికి శుభవార్తగా పరిగణించవచ్చు. దేశంలో కేవలం 4 కోట్ల మంది పేదలు ఉన్నారని, ఇది కేవలం 3 శాతం మాత్రమేనని తెలిపింది. కొన్నేళ్లుగా పేదరికం పరిమాణం తగ్గుతూ వస్తోంది. ఇది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (UNDP) ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ (OPHI)లో ప్రచురించింది. దేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆదాయ స్థాయి MPI ద్వారా కొలవబడుతుంది. దీని ప్రకారం, పేదరిక నిర్మూలనలో భారతదేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం బీహార్. తర్వాతి స్థానాల్లో జార్ఖండ్, ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. తర్వాతి స్థానంలో మేఘాలయ నిలిచింది. భారతదేశంలో 51.9% పేదరికంతో బీహార్ అత్యంత పేద రాష్ట్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు 3 మరియు 4 స్థానాల్లో ఉన్నాయి. గోవాలో పేదరికం వేగంగా తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే విధంగా జమ్మూ మరియు కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోలు ఉన్నాయి. భారతదేశంలో అతి తక్కువ పేదరికం కేరళ. అంటే మొత్తం జనాభాలో కేవలం 0.71% మంది మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. అదేవిధంగా గోవాలో 3.76%, సిక్కింలో 3.82%, తమిళనాడులో 4.89%, పంజాబ్లో 5.59% ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 13.7, ఏపీలో 12.3 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం బీహార్ భారతదేశంలోనే అత్యంత పేద రాష్ట్రం. ముఖ్యంగా తల్లీబిడ్డల ఆరోగ్యం, విద్య, ఆహారం, కరెంటు విషయంలో వెనుకంజ వేస్తున్నారు.
2024-04-23T10:43:21Z
ఈ ఇళ్లే నందనవనం.. రూపకర్త ఎవరో తెలుసుకుందాం..
అది మారుమూల గిరిజన గూడెం. ఆ గూడెంలోని ఆ ఇంటికి వెళితే అది ఒక నందనవనంలా కనిపిస్తుంది. ఒకవైపు రకరకాల పండ్లు, పూల మొక్కలు. మరోవైపు కోళ్లూ, మేకలు సందడి చేస్తూ కనిపిస్తాయి. అవి అంటే ఆ ఇంటి యజమానికి అమితమైన ప్రేమ. అంతేకాదు చేపలు, పశువులను కూడా సాకుతూ సాగు కూడా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తానో విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ.. అవిశ్రాంతంగా వ్యవసాయః పనులు చూసుకుంటున్నారు. పక్కనుండి పనివాళ్ళకు సూచనలు, సలహాలు ఇవ్వడమే కాకుండా అవసరమైతే తానూ కూడా స్వయంగా పొలంలోకి దిగుతారు. అటువైపు వెళ్ళిన అధికారులు గాని, సందర్శకులు గాని త్పపక వారి ఇంటిని, వ్యవసాయ క్షేత్రాన్ని, చేపల చెరువులను చూసి వెళతారు. కొందరైతే ప్రత్యేకంగా వీటిని చూడటానికే ఇక్కడికి వస్తారు. తన స్వయం కృషితో అందరిని ఆకట్టుకుంటున్న ఆ వ్యక్తి మరెవరో కాదు దుర్వ భూమన్న. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందినప్పటికి తాను విశ్రాంత ఉద్యోగినన్న గర్వం ఒక్కింత కూడా లేకుండా సాధారణ రైతు మాదిరి ప్రతిరోజు వ్యవసాయ పనులను దగ్గరుండి చూసుకుంటారు. సాగులో సహాయంగా కొందరు పనివాళ్ళను పెట్టుకొని అన్నీ తానై చూసుకుంటారు. తనకున్న పరిజ్ఞానంతో ఎప్పుడు ఏ పంటలు వేయాలి, ఎలాంటి సాగు పద్దతులు పాటించాలో తెలుసుకుంటూ తదనుగుణంగా పంటలు వేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. కనీస రవాణా సౌకర్యం కూడా లేని ఆ గిరిజన గూడెంలో తన వద్ద ఉన్న వనరులతో సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం కొత్తగూడకు చెందిన దుర్వ భూమన్నకు 40 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో నీటి వసతి ఉన్న భూముల్లో పత్తి, సోయా, జొన్న ఇంకా పలు రకాల పంటలను సాగుచేస్తున్నారు. ఇటీవలే ఆయిల్ ఫాం పంట కూడా వేశారు. ఒక్క వ్యవసాయమే కాకుండా ఇంటి వద్ద మేకలు, కోళ్ల పెంపకం కూడా చేపట్టారు. అటు కొన్ని ఆవులు, పశువులను కూడా సాకుతున్నారు. వ్యవసాయ పనులకు అవసరమయ్యే కొన్ని ఉపకరణాల కోసం ఇతరులపై ఆధారపడకుండా తానే స్వయంగా సేకరించి పెట్టుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలోనే రెండు చేపల చెరువులను కూడా తోడించి, అందులో పలు రకాల చేపల పిల్లలను పెంపకం చేపట్టారు. అటు ఇంటి వద్ద కూడా పలు రకాల పూలు, పండ్లు, కాయగూరల మొక్కలను పెంచుతున్నారు. మామిడి, సపోటా, పనస, మూడు రకాల జామ, బొప్పాయి, అరటి, కొబ్బరి, ఉసిరి, అంజీర్, నిమ్మ చెట్లు ఉన్నాయి. రెండు మూడు రకాల మల్లెలు, కనకాంబరాలు, ఇంకా పలు రకాల పూల మొక్కలు, ఆకు, కాయ గూరల మొక్కలు కూడా ఉన్నాయి. పూర్తిగా సేంద్రియ పద్దతిలో వాటి పెంపకం చేపట్టారు. అటవీ ప్రాంతానికి దగ్గర ఉన్న పంటపొలం కావడంతో అటవీ జంతువుల నుండి పంటలను కాపాడుకునేందుకు ప్రత్యేకంగా సోలార్ విద్యుత్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏదిఏ మైనప్పటికీ తనకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు సాగులో నూతన పద్దతులను, మెళకువలను తెలుసుకుంటూ, వాటిని ఆచరించి అద్భుతాలు సాధిస్తున్న దుర్వ భూమన్నను అందరు అభినందిస్తున్నారు.
2024-04-23T10:43:34Z
Tirumala Rs 300 Tickets: తిరుమలలో రూ.300 దర్శనం టికెట్స్ కావాలా? సులువుగా పొందండిలా
తిరుమల తిరుపతి దేవస్థానం జూలై నెలకు సంబంధించిన టికెట్ల కోటాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జూలై మాసంలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన లక్కీ డిప్ ముగిసింది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా కూడా రిలీజ్ అయింది. వీటితో పాటు అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లను కూడా టీటీడీ విడుదల చేసింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇవి కాకుండా రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కావాలనుకునేవారు ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు వీటిని బుక్ చేసుకోవచ్చు. జూలైలో దర్శనం కోసం మాత్రమే టికెట్స్ అందుబాటులో ఉంటాయన్న విషయాన్ని శ్రీవారి భక్తులు గుర్తుంచుకోవాలి. ఇక తిరుమల, తిరుపతిలో జూలై నెల గదుల కోటాను ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఏప్రిల్ 27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి భక్తులు టికెట్స్ బుక్ చేయడానికి ముందుగా https://ttdevasthanams.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మొబైల్ నెంబర్, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత లాగిన్ చేయాలి. లాగిన్ అయ్యాక ఇతర వివరాలు నమోదు చేసి టికెట్స్ బుక్ చేయొచ్చు.
2024-04-23T07:57:39Z