హైదరాబాద్ లో భారీ వర్షం..
హైదరాబాద్ లో భారీ వర్షం.. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం వరకు ఎండలు బెంబేలిత్తించగా.. ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఒక్కసారిగా వాతవరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, సనత్ నగర్, ఎర్రగడ్డ, చింతల్, అమీర్ పేట, పంజాగుట్ట, బేగంపేట్ సికింద్రాబాద్, ఖైరతాబాద్, నాంపల్లి, ద...
2024-04-20T03:31:02Z
జగన్ని ఫాలో అవుతున్న చంద్రబాబు.. టీడీపీకి ప్లస్ అవుతుందా?
మీరు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగాలను గమనిస్తే.. ఒక విషయం క్లియర్గా అర్థం అవుతుంది. చంద్రబాబు.. పూర్తిగా సీఎం జగన్ని ఫాలో అవుతున్నారు. ఎలాగంటే.. ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న అన్ని పథకాలనూ టీడీపీ కూడా అమలు చేస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. ఇలా చెప్పడానికి బలమైన కారణం ఉంది. టీడీపీ వస్తే, పథకాలన్నీ ఆగిపోతాయనీ, పథకాలు కంటిన్యూ అవ్వాలంటే.. మళ్లీ వైసీపీయే అధికారంలోకి రావాలని జగన్ అంటున్నారు. దాన్ని ఖండించేందుకు.. చంద్రబాబు.. పథకాలేవీ రద్దు చెయ్యనని పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు మరో విషయం కూడా అంటున్నారు. ఉన్న పథకాలకు నిధులను మరింత పెంచుతానని అంటున్నారు. ఉదాహరణకు పెన్షన్ను ఇప్పుడున్న రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచుతానని అంటున్నారు. అలాగే అమ్మ ఒడి లాంటి పథకాలను కంటిన్యూ చేస్తూ.. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంతమందికీ మనీ ఇస్తామని అంటున్నారు. ఇలా తాము అధికారంలోకి వస్తే.. మరింత ఎక్కువగా సంక్షేమం అందిస్తామని అంటున్నారు. అలాగే మరిన్ని ఎక్కువ పథకాలను కూడా ఆయన మేనిఫెస్టోలో చేర్చారు. ఇలా చెయ్యడం ద్వారా.. వైసీపీ పథకాలను టీడీపీ కూడా కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీని ఫాలో అవుతూ చంద్రబాబు మరో విషయం కూడా చెబుతున్నారు. పథకాల డబ్బులు, ప్రయోజనాలను డైరెక్టుగా ఇంటికే వచ్చేలా చేస్తామంటున్నారు. అలాగే లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో మనీ వేస్తామని అంటున్నారు. ఇది కూడా ప్రస్తుతం వైసీపి చేపడుతున్న విధానమే. ఇదే విధానాన్ని తాము కూడా కొనసాగిస్తామని పరోక్షంగా చంద్రబాబు చెబుతున్నారు. ఇక వాలంటీర్ల విషయంలోనూ చంద్రబాబు వైసీపీని ఫాలో అవుతున్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామనీ, వాళ్లకు ఇప్పుడు ఇస్తున్న రూ.5వేలను డబుల్ చేసి రూ.10వేలు ఇస్తామని అంటున్నారు. తద్వారా వైసీపీ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను కూడా చంద్రబాబు సమర్థించినట్లైంది. చంద్రబాబు తన ప్రసంగాల్లో మరో విషయంతో కూడా ఆసక్తి కలిగిస్తున్నారు. తాము జూన్ నుంచి అధికారంలోకి రాగానే.. పెన్షన్ను ఏప్రిల్ నుంచి ఇస్తామని అంటున్నారు. అంటే.. ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్ మొత్తాన్నీ ఒకేసారి రూ.12వేల చొప్పున ఇస్తామన్నట్లు చంద్రబాబు హామీ ఇస్తున్నారు. సాధారణంగా.. అధికార పక్షాన్ని ఫాలో అవ్వడం అనేది ప్రతిపక్షానికి మైనస్ అవుతుంది. కానీ చంద్రబాబు మాత్రం తన వ్యూహం గ్రాండ్ సక్సెస్ అవుతుందనే అంచనాలో ఉన్నారు. ఎందుకంటే.. వైసీపీ ఇస్తున్న సంక్షేమ ప్రయోజనాలను ప్రజలు బాగా పొందుతున్నారు. అందువల్ల వారు వైసీపీకి బాగా అలవాటుపడ్డారు. ప్రతీ నెలా పథకాల ప్రయోజనాలను తప్పనిసరిగా పొందుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు వస్తే, అలా జరగదేమో అని ఆలోచించిన వారికి చంద్రబాబు క్లారిటీ ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే, అంతకు మించిన ప్రయోజనాలను అదే వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తామనే సంకేతాలను చంద్రబాబు ఇస్తున్నారు. సంపదను సృష్టించడం ద్వారా మరింత ఎక్కువగా పథకాలను అమలు చేస్తామని అంటున్నారు. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఈసారి చంద్రబాబు చేస్తున్న హామీలు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. అదీకాక, కూటమి అధికారంలోకి వస్తే, అభివృద్ధి కూడా జరుగుతుందనీ, రాజధాని నిర్మాణం సాగుతుందనే అంచనాలు కొందరిలో ఉన్నాయి. ఈ కారణాల వల్లే.. చంద్రబాబు ఇలాంటి వ్యూహం ఎంచుకున్నారనే వాదన వినిపిస్తోంది. మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయన్నది జూన్ 4న మనకు తెలుస్తుంది.
2024-04-20T01:43:32Z