AP ELECTIONS LIVE UPDATES: సీఎం జగన్‌కు వైఎస్ సౌభాగ్యమ్మ లేఖ

చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ

* అమరావతి: ఉండవల్లిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం

* బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్, జాయింట్ సెక్రటరీ శివ్ ప్రకాష్, స్టేట్ జనరల్ సెక్రటరీ మధుకర్ భేటీ

సీఎం జగన్‌కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ

* 2009లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావు: సౌభాగ్యమ్మ

* 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది

* మన కుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం మరింత బాధపెట్టింది

ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తయారుచేశారు: వైఎస్‌ షర్మిల

* ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా తయారుచేశారు: వైఎస్‌ షర్మిల

* రాజధాని ఎక్కడో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు

* దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా?

* ఒక్క ఛాన్స్‌ అంటూ జగన్‌ సీఎం అయ్యారు

* వాషింగ్టన్‌ డీసీని మించిన రాజధాని అన్నారు

సీఎం జగన్‌పై రాయి దాడి కేసు నిందితుడిని విచారించనున్న పోలీసులు

* సీఎం జగన్‌పై రాయి దాడి కేసు నిందితుడిని నేడు విచారించనున్న పోలీసులు

* నేటి నుంచి మూడు రోజుల పాటు సతీష్‌ను విచారించనున్న పోలీసులు

* ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్న నిందితుడు సతీష్‌

* లాయర్‌, తల్లిదండ్రుల సమక్షంలో నిందితుడిని విచారించాలన్న కోర్టు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరాయి. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ సారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఒకరోజు గడువు ఉండగానే బుధవారం వరకు అసెంబ్లీకి 3,644, లోక్‌సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీకి 1,294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 26న నామినేషన్ల స్క్రూట్నీ జరగనుంది.. ఈ నెల 29 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా.. మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తాజా పరిణామాలు.. ఎన్నికల లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.

* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఇవాళ ఉదయం 7.45 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు. స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్‌ కార్యాలయానికి చేరుకొని నామినేషన్‌ దాఖలు చేస్తారు. ఆ తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

* మరోవైపు జగన్ మేమంతా సిద్ధ బస్సు యాత్ర పూర్తయ్యింది. 22 రోజులు పాటు 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగింది. ఈ యాత్రలో 16 బహిరంగ సభల్లో పాల్గొన్నారు.. 6 ప్రత్యేక సమావేశాలకు సీఎం జగన్‌ హాజరయ్యారు. 9 చోట్ల భారీ రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఇడుపులపాయలో ప్రారంభమై 86 నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర కొనసాగింది.

* మరోవైపు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ ఉమ్మడి కపడ జిల్లా రాజంపేట, కోడూరు నియోజకర్గాల్లో జరిగే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు.

* ఏపీలో పింఛన్‌దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ ఈసీకి అందజేశారు. పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాట్లు చేసినట్లు కనిపించలేదని లేఖలో పేర్కొన్నారు.

* మే నెల పింఛన్‌ పంపిణీకి ఇంకా ఐదు రోజులే సమయం ఉందన్నారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందును ఇంటింటికీ పింఛను పంపిణీని రెండు రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉందన్నారు. ఇంటి వద్దనే పింఛను పంపిణీ జరుగుతుందున్న సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేయాలని కోరారు. పింఛన్లు ఇవ్వకుండా ఈ అంశాన్ని ప్రతిపక్షాలపై నెట్టాలని చూస్తున్నారు. 62వేల మంది వాలంటీర్లతో రాజీనామా చేయించి.. ఇప్పుడు వారిని పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించేందుకు వైఎస్సార్‌సీపీ కుట్ర పన్నుతోందన్నారు. ఈసీకి ఉన్న అపరిమిత అధికారాలను ఉపయోగించి.. వాలంటీర్లుగా చేసిన వారు పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

* మరోవైపు రాష్ట్రంలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో గ్లాసు గుర్తును జనసేన పార్టీకి తప్ప వేరే ఏ ఇతర పార్టీలకు గానీ, స్వతంత్ర అభ్యర్దులకు గానీ కేటాయించవద్దని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జోత్స్య్న, టీడీపీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి విజ్ఞ‌ప్తి చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయాన్ని నేతలు గుర్తు చేశారు. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్ధానాలు, 2 ఎంపీ స్ధానాల్లో జనసేన అభ్యర్దులు పోటీ చేస్తున్నారన్నారు. గ్లాసు గుర్తును జనసేన అభ్యర్దులకు కేటాయించాలని.. మిగిలిన 154 అసెంబ్లీ స్ధానాలు, 23 ఎంపీ స్ధానాల్లో గ్లాసు గుర్తును ఏ ఇతర రాజకీయ పార్టీలకు గానీ, స్వతంత్ర అభ్యర్దులకు గానీ కేటాయించవద్దని కోరారు.

* 2019 ఎన్నికల్లో జనసేనకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో జనసేన 1 అసెంబ్లీ స్ధానాన్ని గెల్చుకుందని.. 6.75 శాతం ఓట్లు వచ్చాయన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా గ్లాసు గుర్తును జనసేనకే కేటాయించాలన్నారు. 2008 సుబ్రమణ్యస్వామి / కేంద్ర ఎన్నికల సంఘం కేసులో ఇలాంటి పరిస్ధితులు వచ్చినపుడు ఒక గుర్తును మరొకరికి కేటాయించొద్దని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. 2013 పీపుల్స్ యూనియన్ సివిల్ ఫర్ లిబర్టీ యూనియన్ / కేంద్ర ప్రభుత్వం కేసులో సైతం సుప్రీం కోర్టు ఇదే రకమైన ఆదేశాలిచ్చిందన్నారు. కాబట్టి గ్లాసు గుర్తును జనసేన అభ్యర్దులకు మాత్రమే కేటాయించాలని ఈసీని కోరామన్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-25T00:16:57Z dg43tfdfdgfd