రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఎన్నికల కోలాహలం నెలకొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటే.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక ఎన్నికల వేళ రాజకీయ నేతలు చేసే ప్రతి మాట.. చాలా ప్రాధాన్యంతో కూడుకుని ఉంటుంది. అందుకే ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు మన పొలిటికల్ లీడర్లు. అయితే ఒక్కొక్కసారి వారు చేసే వ్యాఖ్యలు.. రాజకీయంగా చాలా చర్చకు దారితీస్తాయి. అలాంటి ఘటనే ఈ మధ్య ఒకటి జరిగింది. తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రప్రజలు చాలా తెలివైన వారంటూ కేటీఆర్ అన్నట్లుగా ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతోంది.
ఎలా తెలిసింది?
వైరల్ అవుతున్న వీడియో కోసం యూట్యూబ్లో వెతకగా.. ఏప్రిల్ 12, 2024 నాటి టీవి9 ఇంటర్వ్యూ కనిపించింది. ఈ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ఆంధ్రా ప్రజలు తెలంగాణ ప్రజలకన్నా తెలివైన వారు, కాబట్టి వారు సరైన నిర్ణయం తీసుకుంటారు అని కేటీఆర్ సమాధానమిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయాన్ని గుర్తు చేసుకుంటూ.. తాము తెలంగాణ కోసం పోరాడే సమయంలో ప్రాంతంగా విడిపోయినా ప్రజలుగా కలిసే ఉందామని చెప్పామని.. అదే మాటను పదేళ్లు ఆచరణలో చూపించామని కేటీఆర్ అన్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదనుకున్న హైదరాబాద్లో.. అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు తమకు ఓటేశారని కేటీఆర్ చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలేదని చెప్పారు. అలాగే రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే తమ ఉద్దేశమన్న కేటీఆర్.. అక్కడి ప్రజలు చాలా తెలివైనవారు. తెలంగాణ ప్రజల కంటే చాలా తెలివైనవారు, చైతన్యవంతులు కావున సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు.కేటీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి మీడియాల్లోనూ వార్తలు వచ్చాయి.
(This story was Originally published by Factly and Edited by Samayam Telugu As a Part of Shakti Collective)
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-05-05T11:58:25Z dg43tfdfdgfd