గుంటూరు: ఆస్పత్రిలో ఇదేం పాడు పని.. జనాలున్నారనే సిగ్గు లేకుండా!

ఓ వ్యక్తి ఆస్పత్రి వరండాలో కూర్చున్నాడు. చుట్టూ పేషంట్ల బంధువులు నిద్రపోతున్నారు.. కొందరు దూరంగా కూర్చుని ఉన్నారు. ఎవరూ లేరని భావించిన సదరు వ్యక్తి వచ్చిన పని మొదలుపెట్టాడు.. నిమిషాల్లో పని పూర్తి చేశాడు. ఈ సీన్ మొత్తం దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ కాగా. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన బయటపడింది.

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి నిత్యం పేషెంట్లతో రద్దీగా ఉంటుంది. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ల బంధువులు బయట వేచి ఉంటారు. రాత్రి సమయంలో వరండాలో నిద్రపోతుంటారు.. దీనిని కొందరు దొంగలు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వరండాలో నిద్రపోతున్న పేషెంట్ల బంధువుల మొబైల్స్, ఇతర విలువైన వస్తువుల్ని చోరీ చేస్తున్నారు. తాజాగా ఇదే జరిగింది.. ఆస్పత్రి వరండాలో నిద్రపోతున్న ఓ పేషెంట్ బంధువు పక్కనే ఓ వ్యక్తి కూర్చున్నాడు. అటు ఇటు చూసి.. మెల్లిగా మొబైల్ నొక్కేశాడు.. ఆ సీన్ మొత్తం ఎదురుగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో బయటపడటంతో చోరీల వ్యవహారం బయటగపడింది.

జీజీహెచ్‌లో వరుసగా మొబైల్స్‌ చోరీలు జరుగుతున్నాయి. పేషెంట్ల బంధువులతో పాటుగా ఆస్పత్రి సిబ్బంది కూడా దొంగతనాల బాధితులే. కొందరు పేషెంట్ల అటెండెంట్‌లమని చెప్పి లోపలికి వచ్చి చోరీలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే అటెండెండర్లకు పాసులు ఇవ్వాలని కోరుతున్నారు. అప్పుడే ఇలాంటి దొంగతనాలకు అడ్డుకట్ట వేయొచ్చంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చేవారంతా పేదవాళ్లే.. అలాంటి వాళ్ల దగ్గర మొబైల్స్, ఇతర వస్తువులు చోరీ చేయడంతో ఇబ్బందిపడుతున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T05:27:30Z dg43tfdfdgfd