తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రామేశంపేట దగ్గర ఎన్నికల సందర్భంగా చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. పోలీసులు చెక్పోస్ట్ దగ్గర సోమవారం ఉదయం 11.15 గంటల సమయంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఓ వాహనంలో పోలీసులు సోదా చేయగా.. అందులో రూ.2.71 కోట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వాహనాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న ప్లయింగ్స్క్వాడ్ మేజిస్ట్రేట్ ఆ చెక్పోస్ట్ దగ్గరకు చేరుకున్నారు.
ఆ వాహన సిబ్బందిని విచారణ చేయగా సిబ్బందివారి దగ్గర ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెస్ట్ విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం బ్రాంచ్కి 2.71 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్స్ఫార్మర్ ఓచర్, ఈసీఐ (భారత ఎన్నికల కమిషన్) జారీ చేసిన యూనిక్ ఐడీ పత్రాన్ని చూపించారు. సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు బ్యాంక్ వారితో సంప్రదించి.. ఎలక్షన్ సీజరు మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్లో సరిచూసుకొన్నారు. స్థానిక ఎస్హెచ్వో, ఎఈవో, ప్లయింగ్ స్క్వాడ్ జిల్లా నోడల్ అధికారి వారితో సంప్రదించారు. సదరు 2.71 కోట్ల సొమ్మును విడుదల చేశామని ప్లయింగ్ స్క్వాడ్ మేజిస్ట్రేట్ తెలిపారు. ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా బంగారం, వెండి, డబ్బులు దొరికిపోయిన సంగతి తెలిసిందే.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-05-07T01:18:52Z dg43tfdfdgfd