123 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా రేషన్ బియ్యం కొని మహారాష్ట్రలో అమ్మేందుకు వ్యాన్లో తరలిస్తున్న 123 క్వింటాళ్లను కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం తెల్లవారుజామున కాగజ్ నగర్ నుంచి మహారాష్ట్రకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యాన్ను స్థానిక మసాలా వాగు వద్ద పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి సయ్యద్ ఆరిఫ్, ఇషాక్ అహ్మద్ అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న బియ్యం విలువ రూ.4 లక్షలు ఉంటుందని, కాగజ్నగర్ ఎంఎల్ఎస్ పాయింట్ లో అప్పగించి వ్యాన్ను రూరల్ పీఎస్కు తరలించినట్లు అధికారులుతెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-09T04:19:41Z dg43tfdfdgfd