30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు

30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 30 మంది అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటీవల 10 మందిపై కేసులు నమోదు చేయించిన కమిషనర్, తాజాగా 30 మందిపై చర్యలు తీసుకున్నారు. ఆర్పీ యాక్ట్ 1951, సెక్షన్134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తునట్లు కమిషనర్ తెలిపారు.

సైఫాబాద్​లో 40 మందిపై.. 

బషీర్ బాగ్: ఎన్నికల విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 40 ఉద్యోగులు ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారు. వారిపై అడిషనల్ కమిషనర్ మంగతాయారు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-23T05:40:16Z dg43tfdfdgfd