ANDHRA PRADESH: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత

YS Jagan announces Rajya Sabha seat for Hafeez Khan - ఎమ్మిగనూరు: తాను మాట ఇచ్చానంటే నిలబెట్టుకునే వ్యక్తినని చెప్పే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన హఫీజ్ ఖాన్‌ను రాజ్యసభకు పంపిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన  ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కర్నూల్ నుంచి హఫీజ్ ఖాన్‌కు తాను టికెట్ ఇవ్వలేకపోయానని, 2 ఏళ్ల తరువాత వచ్చే రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిగా తాజాగా ప్రకటించారు. తన మనసులో ఎలాంటి కల్మషం ఉండదని, అందుకే లక్షల మంది సమక్షంలో ముస్లిం నేత హఫీజ్ ఖాన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించానన్నారు. చంద్రబాబుకు, తనకు మధ్య ఉన్న తేడా ఇదేనన్నారు.  

2024-03-29T15:13:38Z dg43tfdfdgfd