Andhra Pradesh DGP Rajendranath Reddy Releive From Service: ఎన్నికల ముందు ఏపీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటన జగన్ సర్కార్ కు బిగ్ ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని, బదిలీ చేస్తు ఎన్నికల సంఘం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలంటూ సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు పంపించింది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీలు డీజీపీపై పలుమార్లు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. రాజేంద్రనాథ్ రెడ్డి జగన్ సర్కార్ కు ఫెవర్ గా పనిచేస్తున్నారంటూ ఈసీ కి అనేక మార్లు కంప్లైంట్ లు ఇచ్చారు.
ఏపీలో ఎన్నికలను సవ్యంగా నిర్వర్తించడంతో, శాంతి భద్రతలను కాపాడటంతో డీజీపీ అలసత్వం వహించినట్లు అనేక పార్టీల నుంచి ఫిర్యాదులు ఈసీకి వెల్లువెత్తాయి. ఈక్రమంలో ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ చేయాలని ఈసీ ఆదేశించింది. అదే విధంగా.. సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త జాబితా పంపాలని ఆదేశించింది. ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల పేర్లను పంపించాలని కూడా ఏపీ సీఎస్ జవహార్ రెడ్డికి ఈసీ సూచించింది.
Read More: DY Chandrachud: స్కూల్ లో నన్ను చావబాదారు.. సెమినార్ లో ఎమోషనల్ అయిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
2024-05-05T13:25:17Z dg43tfdfdgfd