Special Trains: విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా మరిన్ని స్పెషల్ ట్రైన్స్
భారతీయ రైల్వే రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వేసవి సెలవుల దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం, చెన్నై ఎగ్మోర్ మీదుగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి వీక్లీ స్పెషల్ ట్రైన్స్. విజయవాడ మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి. రైలు నెంబర్ 08577 విశాఖపట్నం నుంచి చెన్నై ఎగ్మోర్ వరకు సమ్మర్ స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. మే 27, జూన్ 3, 10, 17, 24 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది. ప్రతీ సోమవారం సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నంలో ఈ రైలు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 08578 చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖపట్నం వరకు సమ్మర్ స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. మే 28, జూన్ 4, 11, 18, 25 తేదీల్లో ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది. ప్రతీ మంగళవారం ఉదయం 10.30 గంటలకు చెన్నై ఎగ్మోర్లో ఈ రైలు బయల్దేరితే అర్ధరాత్రి 1 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం-చెన్నై ఎగ్మోర్, చెన్నై ఎగ్మోర్-విశాఖపట్నం స్పెషల్ ట్రైన్స్ దారిలో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోల్, నెల్లూరు, గూడూరు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. విశాఖపట్నం, చెన్నై ఎగ్మోర్ మధ్య నడిచే ఈ రైళ్లల్లో 10 ఏసీ 3 టైర్ ఎకనమీ కోచ్లు, 6 స్లీపర్ క్లాస్ కోచ్లు, 2 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు, 1 సెకండ్ క్లాస్ కోచ్, 1 లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల బుకింగ్ కొనసాగుతోంది.
2024-05-17T09:50:43Z