NEWS LIVE UPDATES: ఏపీ, తెలంగాణ, లోక్‌సభ వార్తలు.. లైవ్ అప్ డేట్స్

News Live updates: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఇక అసలైన పోరు మొదలైనట్లే. పోటీ నుంచి తప్పుకోవాలని ఫిక్స్ అయినవారు ఏప్రిల్ 29లోపు తమ నామినేషన్లను ఉప సంహరించుకోవచ్చు. నిన్న రెండో దశ ప్రశాంతంగా ముగియడంతో.. దేశవ్యాప్తంగా 200 స్థానాల్లో లోక్ సభ ఎన్నికలు ముగిసినట్లైంది. ఇక మే 7న జరిగే మూడో దశ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లలో ఉన్నారు. ఇక నేడు ఏపీలో వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చెయ్యబోతోంది. దీనిపై చాలా అంచనాలు ఉన్నాయి. దీన్ని బట్టీ.. టీడీపీ కూటమి మేనిఫెస్టో ఉండనుందని తెలుస్తోంది. ఇటు తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్నారు. ఈ సందర్భంగా.. జిల్లాల్లోని పార్టీ ఆఫీసుల్లో జెండాలు ఎగరేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. హీట్ వేవ్ ఉండటంతో.. 3 రోజులపాటూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అటు ఐపీఎల్‌లో ఇవాళ వీకెండ్ కావడంతో 2 మ్యాచ్‌లు ఉన్నాయి. ఒక మ్యాచ్ ఢిల్లీ, ముంబై మధ్య జరుగుతుంది. రెండో మ్యాచ్ లక్నో, రాజస్థాన్ మధ్య జరుగుతుంది. ఇలాంటి అంశాలపై లైవ్ అప్‌డేట్స్ తెలుసుకుందాం.

2024-04-27T00:38:46Z dg43tfdfdgfd