NEWS LIVE UPDATES: ఏపీ, తెలంగాణ, లోక్‌సభ వార్తలు.. లైవ్ అప్ డేట్స్

News Live updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్‌కి కొత్త డీజీపీని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 11 గంటల తర్వాత.. విషయం తేలే అవకాశాలు ఉన్నాయి. అది అలా ఉంచితే.. ఇవాళ ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. ఆయన వేమగిరి, అనకాపల్లిలో జరిగే కూటమి సభల్లో పాల్గొంటారు. అటు సీఎం జగన్.. ఇవాళ ఉదయం రేపల్లె, మధ్యాహ్నం మాచర్ల, మచిలీపట్నంకి వెళ్తారు. ప్రచారం చేస్తారు. అటు లాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై దర్యాప్తులో భాగంగా.. సీఐడీ ఇవాళ టీడీపీ సోషల్ మీడియా ఇంఛార్జిని విచారించనుంది. మరోవైపు ఇప్పటి నుంచి 5 రోజులు వాతావరణం చల్లబడి, వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పడం మంచి తరుణంగా చెప్పుకోవచ్చు. అసలే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేతలు, ప్రజలు ఎండలతో ఇబ్బంది పడుతున్నారు.

ఐపీఎల్‌లో ఇవాళ 1 మ్యాచ్ ఉంది. హైదరాబాద్ (SRH), ముంబై (MI) మధ్య రాత్రి 7.30కి మ్యాచ్ ముంబైలో జరుగుతుంది. ఇలాంటి అంశాలపై లైవ్ అప్‌డేట్స్ తెలుసుకుందాం.

2024-05-06T01:13:58Z dg43tfdfdgfd