RAHUL GANDHI: రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన ఆ మహిళ సీపీఎం నేత సుభాషిణి అలీ అవునా కాదా?

Rahul Gandhi: ఎన్నికల వేళ వైరల్ అయ్యే వీడియోల్లో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలుసుకోకుండా చాలా మంది షేర్ చేస్తూనే ఉంటారు. అయితే అందులో చాలా వరకు ఫేక్, తప్పుదోవ పట్టించే వీడియోలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ మహిళ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి దూత అని చెబుతూనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే అందులో ఉన్న మహిళ సీపీఎం నాయకురాలు సుభాషిణి అలీ అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అయితే అది ఫేక్ అని తేలింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఏం ఉంది?

ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ ఓ మహిళ మీడియాతో మాట్లాడుతున్నట్లు ఉన్న వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆమె సీపీఎం నేత సుభాషిణి అలీ అంటూ ట్విటర్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది. భారతదేశాన్ని, రాజకీయాలను రాహుల్ గాంధీ అర్థం చేసుకోలేదని ఆ వీడియోలో మహిళ తెలిపింది. ఆయన దేశాన్ని ముందుకు తీసుకెళ్లలేడని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం సంక్షోభంలో ప్రయాణిస్తోందని.. పరిస్థితిని బట్టి దేశాన్ని నడిపించడంలో ప్రధాని మోదీ సమర్థుడు అని ఆ మహిళ వెల్లడించింది. మోదీ శాంతి దూత అని తాను నమ్ముతున్నానని చెప్పడం గమనార్హం. ఓటు వేయడం గురించి అందరూ దృష్టి పెట్టండని సూచించింది. అందరూ ఓటు వేయాలని.. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విజ్ఞతతో ఓటు వేయండి అని పేర్కొన్నారు.

నిజం ఏంటి?

వైరల్ అవుతున్న వీడియోలో ఉంది సీపీఎం నేత సుభాషిణి అలీ కాదని న్యూస్ మీటర్ అనే ఫ్యాక్ట్‌చెక్ సంస్థ చేసి ధ్రువీకరించింది. ప్రధాని మోదీని, రాహుల్ గాంధీని విమర్శించింది సుభాషిణి అలీ కాదని తేలింది.

వెరిఫికేషన్ అండ్ మెథడాలజీ

ఈ వీడియోపై న్యూస్‌మీటర్ చేసిన ఫ్యాక్ట్‌చెక్‌లో అది తప్పుదోవ పట్టించేదని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా సుభాషిణి అలీ కూడా ధ్రువీకరించారు. ఆ వీడియోలో ఆమె 99 కబర్ న్యూస్ అనే ఛానల్ లోగోతో మాట్లాడగా.. ఆ వీడియో గురించి యూట్యూబ్‌లో సెర్చ్ చేయగా.. 13 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోను 2024 జనవరి 29 వ తేదీన ఆ వైరల్ క్లిప్ 6:55 నిమిషాల వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆమె సుభాషిణి అలీ అని ఆ ఛానల్ కూడా చెప్పలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ గురించి ప్రజల ఒపీనియన్ తీసుకున్నట్లు తెలిపింది.

ఈ ఘటనపై సుభాషిణి అలీ ట్విటర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తన పేరు మీద ఓ వీడియో సోషల్ మీడియాలో తప్పుదోవపట్టించేలా ఉందని కేంద్ర ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలో ఉన్న మహిళ, సుభాషిణి అలీ ఫోటోలను పక్క పక్కనే ఉంచి పోల్చి చూడగా.. ఆ వీడియోలో ఉంది సుభాషిణి అలీ కాదని స్పష్టం అవుతోంది. దీంతో ఆ వీడియోలో ఉన్న మహిళ సుభాషిణి అలీ అనేది తప్పు అని రుజువు అయింది.

(This story was Originally published by Newsmeter and Edited by Samayam Telugu As a Part of Shakti Collective)

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T18:24:10Z dg43tfdfdgfd