తెల్ల రేషన్కార్డుదారులకు శుభవార్త.. ఉచితంగా కార్ డ్రైవింగ్ ట్రైనింగ్
పేద ప్రజల జీవన గమనాన్ని దృష్టిలో పెట్టుకొని పలు రాష్ట్రాలు రేషన్ కార్డులు జారీ చేస్తున్నాయి. దారిద్రవ్య రేఖకు దిగువన ఉన్న వాళ్లంతా రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులు. సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా తెల్ల రేషన్కార్డును తీసుకుంటారు. తెల్ల రేషన్కార్డు ఉన్న వారిని పేదలుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి. రేషన్ పంపిణీ మొదలుకొని, విద్యార్థులకు స్కాలర్ షిప్స్, లోన్స్, వాటికి సబ్సిడీ ఇలా బోలెడన్ని బెనిఫిట్స్ అందిస్తుంటారు. ఈ క్రమంలోనే రూడ్ సెట్ సంస్థ తెల్ల రేషన్ కార్డుదారులకు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్ అంశాలపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అనంతపురంలో ఉన్న ఈ సంస్థలో మే 20వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. గ్రామీణ ప్రాంత యువకులకు కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్పై ఉచితంగా శిక్షణ ఇచ్చి వారిని స్వయం ఉపాధి వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. క్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామని రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు. ఈ ట్రైనింగ్ ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి మాత్రమే అని తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం కూడా తెల్ల రేషన్కార్డుదారులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా వీరి కోసం కొన్ని పథకాలు రూపొందించడం చూస్తూనే ఉన్నాం. కాగా.. తెలంగాణ బోగస్ రేషన్ కార్డులు తొలగించడమే లక్ష్యంగా రాష్ట్రమంతా రేషన్ ఈ- కేవైసీ ప్రక్రియ షురూ చేసింది ప్రభుత్వం. కొద్ది నెలల క్రితం రేషన్ కార్డు ఈ ప్రక్రియ మొదలు పెట్టు కంటిన్యూ చేస్తున్నారు. దీంతో రేషన్ కార్డుదారులు అన్ని చోట్ల రేషన్ షాపులకు వెళ్లి వేలిముద్రలు ఇచ్చి బయోమెట్రిక్ కంప్లీట్ చేస్తున్నారు.
2024-05-18T02:08:41Z
Weather Report: తెలుగు రాష్ట్రాలపై తుఫాను వాతావరణం.. నేడు వర్ష సూచన
ఈ నెల 19న అండమాన్ నికోబార్ దీవుల్ని నైరుతీ రుతుపవనాలు చేరుకుంటాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. తమిళనాడుతోపాటూ.. తెలుగు రాష్ట్రాలపై తుఫాను తరహా వాతావరణం ఉంది. అంటే మేఘాలు దట్టంగా ఉన్నాయి. దీని వల్ల వచ్చే 7 రోజులపాటూ.. తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు.. తేలికపాటి నుంచి మోస్తరుగా అక్కడక్కడా కురుస్తాయి అని IMD తెలిపింది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని తెలిపింది. శాటిలైట్స్ అంచనాల ప్రకారం.. ఇవాళ (మే 18) ఏపీ, తెలంగాణ రోజంతా మేఘాలు ఉంటాయి. ఉదయం పశ్చిమ రాయలసీమ, నైరురీ తెలంగాణలో వాన పడుతుంది. మధ్యాహ్నం 12 తర్వాత గుంటూరు, కోస్తాంధ్ర తీరంలో వర్షం పడుతుంది. మధ్యాహ్నం 2 తర్వాత కల్వకుర్తి, దేవరకొండ, నంద్యాల, కోస్తాంధ్ర, విశాఖ, తుని, కాకినాడలో మోస్తరు వాన పడుతుంది. క్రమంగా అది పెరుగుతూ.. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్, ఖమ్మం, కడప, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరులో తేలికపాటి నుంచి మోస్తరు వాన పడుతుంది. సాయంత్రం 6 తర్వాత హైదరాబాద్తోపాటూ.. దక్షిణ రాయలసీమలో మోస్తరు వాన పడుతుంది. ఈ వాన రాత్రంతా కురుస్తూనే ఉంటుంది. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 9 నుంచి 15 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గంటకు 8 నుంచి 15 కిలోమీటర్లుగా ఉంటుంది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఎక్కువ వేగం ఉంటుంది. తెలంగాణలో గాలి వేగం గంటకు 5 నుంచి 10 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇవాళ మాగ్జిమం ఉష్ణోగ్రత తెలంగాణలో 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 29 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఐతే.. మేఘాలు, గాలి వల్ల ఎండ ఉన్న ఫీలింగ్ అంతగా ఉండదు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేమ బాగా ఉంది. ఉత్తర తెలంగాణ తప్ప మిగతా అంతటా తేమ ఉంది. హైదరాబాద్లో 52 శాతం, గుంటూరులో 71 శాతం తేమ ఉంది. విశాఖలో 66 శాతం ఉంది. మధ్యాహ్నం తర్వాత తేమ పెరుగుతూ.. సాయంత్రానికి 100 శాతం తేమ ఉండి.. వర్షాలు బాగా పడే అవకాశాలు ఉన్నాయి. (All Images credit - IMD)
2024-05-18T01:08:25Z