TSPSC Group 1 Preliminary Exam 2024 : గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష(TSPSC Group 1 Preliminary Exam)కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పరీక్షను(Group 1 Preliminary Exam dates) జూన్ 9వ తేదీన నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. పేపర్ లీకేజ్ వ్యవహారం తర్వాత…. పరీక్షలన్నీ కూడా కంప్యూటర్ ఆధారిత విధానంలోనే నిర్వహిస్తోంది టీఎస్పీఎస్సీ. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్(TS Group 1 Preliminary Exam) పరీక్ష కూడా ఇదే తరహాలో ఉంటుందని భావించారు. అయితే ఇందుకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది కమిషన్. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను సీబీఆర్టీ విధానంలో కాకుండా…. ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ నోటిఫికేషన్ విడుదలైన సమయంలోనే…. పరీక్ష నిర్వహణపై క్లారిటీ ఇచ్చింది టీఎస్పీఎస్సీ(TSPSC). ప్రిలిమినరీ ఎగ్జామ్ ను ఓఎంఆర్ లేదా సీబీఆర్టీ విధానంలో నిర్వహించే అవకాశముందని తెలిపింది. దీనిపై కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. అయితే గ్రూప్-1కు(Group 1 Preliminary Exam Applications) భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 4.03 లక్షల అప్లికేషన్లు రావటంతో…. పరీక్షను ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని కమిషన్ తాజాగా నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని అంచనా వేసింది. దీంతో… ఈసారి జరగబోయే ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
తెలంగాణ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైంది. మార్చి 14వ తేదీతోనే గడువు ముగిసింది. కానీ టీఎస్పీఎస్సీ మరో రెండు పొడిగించింది. దీంతో మార్చి 16వ తేదీతో అప్లికేషన్ల ప్రక్రియ ముగిసింది.ఈనోటిఫికేషన్ లో భాగంగా 563 ఉద్యోగాలను భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ(TSPSC). జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష ఉండగా, అక్టోబరు 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. పరీక్షలకు ఏడు రోజుల ముందుగా వెబ్ సైట్ లో హాల్ టికెట్లను తీసుకురానుంది.
గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులు మొదటగా ప్రిలిమ్స్ రాయాలి. రెండో దశలో మెయిన్స్ ఉంటుంది.
1. ప్రిలిమినరీ ఎగ్జామ్
2. మెయిన్ ఎగ్జామినేషన్
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తినే మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు. హాజరైన అభ్యర్థులను లెక్కలోకి తీసుకొని నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందిన వారికి.. రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షను పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది. ఇక 2వ దశలో నిర్వహించే మెయిన్ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి 900 మార్కులు కేటాయించారు. ఈ 6 పేపర్లకు అదనంగా జనరల్ ఇంగ్లీష్ అర్హత పేపర్గా ఉంటుంది. ఈ పేపర్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు. దీనికి 3 గంటల సమయం కేటాయించారు.
ప్రిలిమ్స్ సిలబస్ చూస్తే....General Studies మరియు Mental ability ఉంటుంది. జనరల్ స్టడీస్ లో భాగంగా... సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు(జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ) ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాలు, జనరల్ సైన్, ఇన్విరాన్ మెంటర్ స్టడీస్, భారత దేశ ఆర్థిక వ్యవస్థ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, భారతదేశ చరిత్ర, భారత రాజ్యాంగం, గవర్నెన్స్, తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ సాహిత్యం, కళలు వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మరికొన్ని ప్రశ్నలు రీజనింగ్ Analytical Ability ,Data Interpretation వంటి టాపిక్స్ నుంచి వస్తాయి.
ఇక మెయిన్స్ పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ కు 150 మార్కులు కేటాయించారు. వ్యవధి 3 గంటలుగా ఉంటుంది. పేపర్ -1 లో జనరల్ ఎస్సే 150 మార్కులకు ఉంటుంది.