ఆ అధికారుల స్పెషల్ మెనూ ఇదేనట.. సూపర్ కదూ !
ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఎన్నికలే తరువాయి. మారుమ్రోగిన మైకులు ఒక్కసారిగా మూగపోయాయి. అయితే ఈసీ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సైతం చకచకా సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావుడి లో అధికారులు బిజీ అయ్యారు. అలాగే ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది సైతం సిద్దం అయ్యారు. కాగా ఎన్నికల అధికారులకు ప్రత్యేకమైన మెనూ అమలు చేయాలని ఎన్నికల కమీషన్ ఆదేశించింది. 12వతేదీ సాయంత్రం సాధారణంగా ఎన్నికల నిర్వహణకు కేటాయించిన పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులకు హాజరవుతారు. ఆ సమయంలో సమోసా, మజ్జిగ అలాగే రాత్రి సమయంలో అన్నం, ఏదైనా కూర, చపాతీ, టమాటా, పప్పు, పెరుగు ఇలా మెనూ అమలు చేయనున్నారు. అయితే పోలింగ్ రోజున కూడా ప్రత్యేక మెనూ అమలు చేయనున్నట్లు ఈసీ తెలిపింది. ఉదయం టీ, అరటి పండ్లు, ఉప్మా, అలాగే మజ్జిగ అందించనున్నారు. మద్యాహ్నం కోడిగుడ్డు కూర, చట్నీ, సాంబారు, పెరుగు భోజనం అందిస్తారు. సాయంత్రం 5.30 టీ, బిస్కెట్లు అందించనుండగా, స్థానిక అధికారులు వీటి అమలు తీరును పర్యవేక్షించనున్నారు.
2024-05-11T15:13:21Z