అక్రమంగా స్థలంలోకి వెళ్లిన ఏడుగురు అరెస్ట్
జీడిమెట్ల, వెలుగు: అక్రమంగా స్థలంలోకి వెళ్లిన ఏడుగురిని పేట్బషీరాబాద్పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ లోని సర్వే నంబర్ 25/1 లోని 3 ఎకరాల భూమిలోకి గతేడాది అక్టోబర్లో కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి కాంపౌండ్ వాల్ కూల్చి వేయగా క్రిమినల్ కేసు నమోదైంది. గురువారం మరోసారి కూన మాణిక్యం గౌరీశ్ అతని అనుచరులు యండమూరి దుర్గ, అమరిజింత అరవింద్, సోనాసింగ్, మహాసింగ్, రంజిత్ సింగ్, బచన్సింగ్ అక్రమంగా ప్రవేశించారు.
దీంతో వారిని అరెస్ట్ చేసి కుత్బుల్లాపూర్ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. వారి వద్ద మూడు కార్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-19T04:30:42Z dg43tfdfdgfd