అదానీతో శ్రీలంక విద్యుత్ కొనుగోలు ఒప్పందం
కొలంబో: ద్వీపదేశం శ్రీలంక 484 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రాల అభివృద్ధికి అదానీ గ్రీన్ ఎనర్జీతో 20 సంవత్సరాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రతి కిలో వాట్ అవర్కు 0.0826 డాలర్ల చొప్పున అదానీ కంపెనీకి తమ కరెన్సీలోనే చెల్లిస్తామని లంక ఇంధన మంత్రి కాంచన విజయశేఖర తెలిపారు. కొనుగోలు ఖర్చు కిలో వాట్ అవర్కు 39.02 శ్రీలంక రూపాయలు అవుతుందని, ఇది ప్రస్తుత సగటు ఇంధన ధర కంటే తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. మన్నార్, పూనేరిన్లలో 484 మెగా వాట్ల పవన విద్యుత్ కేంద్రాల అభివృద్ధికి మార్చి 2022లోనే క్యాబినెట్ ఆమోదం లభించింది.
©️ VIL Media Pvt Ltd. 2024-05-08T02:36:55Z dg43tfdfdgfd