ఆసియా యూత్ బాక్సింగ్లో 5 గోల్డ్ మెడల్స్
ఆస్టానా (కజకిస్తాన్): ఆసియా అండర్22, యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఐదుగురు ఇండియన్స్ గోల్డ్ మెడల్స్ సాధించారు. మెన్స్ 48 కేజీ ఫైనల్లో బ్రిజేష్ 5–0తో తజకిస్తాన్ బాక్సర్ ముమినోవ్ను చిత్తు చేసి ఇండియాకు తొలి గోల్డ్ అందించాడు. ఇతర బౌట్లలో ఆర్యన్ హుడా (51 కేజీ), యశ్వర్ధన్ సింగ్ (63.5 కేజీ) తమ ప్రత్యర్థులపై నెగ్గగా, విమెన్స్లో లక్ష్మి (50 కేజీ), నిషా (52 కేజీ) కూడా గోల్డెన్ పంచ్ విసిరారు. మరో తొమ్మిది మంది తమ ఫైనల్ బౌట్లలో ఓడి సిల్వర్ మెడల్స్తో తిరిగొచ్చారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-07T02:18:10Z dg43tfdfdgfd