ఇయ్యాళ్ల ఇందూరులో కేసీఆర్ మీటింగ్

ఇయ్యాళ్ల ఇందూరులో కేసీఆర్ మీటింగ్

నిజామాబాద్​, వెలుగు: బీఆర్‌‌ఎస్​ అధినేత కేసీఆర్​సోమవారం పార్లమెంట్​ఎన్నికల ప్రచారం కోసం నిజామాబాద్​ రానున్నారు. మాజీ సీఎం  కేసీఆర్‌‌  రోడ్​షో, కార్నర్​ మీటింగ్​ నిర్వహిస్తారని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి మీడియాకు తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు పాత కలెక్టరేట్​ గ్రౌండ్​ నుంచి రోడ్​ షో ఉంటుందని నెహ్రూపార్క్​, గాంధీ చౌరస్తా మధ్యలో కార్నర్​మీటింగ్​ ఏర్పాటు చేశామన్నారు.  మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్​ గుప్తా ఇంట్లో రాత్రి బస చేసి మరుసటి రోజు ఉదయం కామారెడ్డికి బస్సుయాత్ర వెళ్తుందని చెప్పారు.  ఈ సందర్భంగా కార్నర్​ మీటింగ్​ ఏరియా విజిట్​ చేశారు. రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా తదితరులున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T03:30:11Z dg43tfdfdgfd