ఇవ్వాల ఇందూరుకు అమిత్ షా

ఇవ్వాల ఇందూరుకు అమిత్ షా

నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిజామాబాద్​ నగరానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షా రానున్నారని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ తెలిపారు.  బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ దినేష్​ కులాచారితో కలిసి ఆయన పార్టీ జిల్లా ఆఫీస్​లో శనివారం మీడియాతో మాట్లాడారు. గిరిరాజ్​ గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే సభలో ఆయన ప్రసంగిస్తారన్నారు. 

ఈ ఎన్నికల్లో ప్రధానిగా మరోసారి మోదీ కావాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు.  అర్వింద్​ను ఎంపీగా గెలిపించేందుకు ప్రజలు డిసైడ్​ అయ్యారన్నారు. అమిత్​ షా అటెండ్​ కానున్న సభ ఏర్పాట్లను అర్వింద్​ పార్టీ లీడర్లతో కలిసి పరిశీలించారు.  34 డివిజన్​ కార్పొరేటర్​ శనివారం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ నుంచి బీజేపీలో చేరారు. మాజీ కార్పొరేటర్​చంద్రభూషణ్​, కైరం కొండ మురళి, గుండా సతీశ్​, నల్ల గంగాధర్​కు కాషాయ కండువా వేసి ఎమ్మెల్యే  పార్టీలోకి ఆహ్వానించారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-05-05T05:41:47Z dg43tfdfdgfd