ఈ ఎన్నికలు గుజరాత్ వర్సెస్ తెలంగాణ : సీఎం రేవంత్రెడ్డి
చందానగర్/కూకట్పల్లి, వెలుగు: ఈ లోక్సభ ఎన్నికలు ఫైనల్ మ్యాచ్అని, గుజరాత్ అహంకారానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య పోటీ జరుగుతున్నదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ సమరంలో కాంగ్రెస్ను గెలిపిస్తారో? తెలంగాణపై మోదీ, అమిత్షా పెత్తనాన్ని రుద్దుతారో? రాష్ట్ర యువకులు, ప్రజలు తేల్చుకోవాలని కోరారు. డిసెంబర్3న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్ అని, ఇందులో ప్రజలు 420 కేసీఆర్ను ఓడించి ఇంటికి పంపారని చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డికి మద్దతుగా శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్లోని తారానగర్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్తోపాటు మల్కాజ్గిరి అభ్యర్థి సునీతా మహేందర్రెడ్డి తరఫున కూకట్పల్లిలో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పదేండ్లు రాష్ట్రాన్ని పట్టి పీడించి వేలాది కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చామని, ఇక ఏ సమస్యలు లేవని కార్యకర్తలు, నాయకులు అనుకోవద్దన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. దళితులు, బీసీ బిడ్డలు, మైనా ర్టీలు.. డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర ఉద్యోగాల్లో రాణిస్తున్నారంటే దానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్లే కారణమని అన్నారు. రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే.. బీజేపీ మాత్రం రద్దు చేయాలని చూస్తున్నదని విమర్శించారు.
బీసీలు, మైనార్టీలు, దళితులకు రిజర్వేషన్లు పెంచాలని మోదీ, అమిత్షాకు చెప్తే, బీజేపీ వాళ్లు ఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్లో తనపై ఫిర్యాదు చేశారని రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఇది వరకు కేసీఆర్తనపై 200కు పైగా కేసులు పెడితేనే భయపడలేదని, ఢిల్లీ పోలీసులు తనను ఢిల్లీకి రమ్మంటే తాను రానని చెప్పి శేరిలింగంపల్లి మీటింగ్కు వచ్చానని పేర్కొన్నారు. కేసీఆర్ ఓడిపోతే ఇప్పుడు నరేంద్ర మోదీ వచ్చి కేసులుపెట్టి బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించి, కాంగ్రెస్ను గెలిపించుకుంటానని చెప్పారు.
ఈ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా రంజిత్రెడ్డిని గెలిపిస్తే చందానగర్ నుంచి ఆర్సీపురం వరకు, హైటెక్సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని అమెరికా కాన్సులేట్ వరకు మెట్రో తీసుకువస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. వీటితోపాటు నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఎల్బీనగర్ నుంచి హయత్నగర్, ఎల్బీనగర్ నుంచి ఒవైసీ మీదుగా ఎయిర్పోర్టు వరకు మెట్రో తీసుకువచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు.
విభజన హామీలు నెరవేర్చకుండా పదేండ్లుగా మోదీ తెలంగా ణకు తీరని అన్యాయం చేశారని అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రె స్ ఇన్చార్జి జగదీశ్వర్గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మల్కాజ్గిరి ఎంపీగా సునీతామహేంద్రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపిస్తే కూకట్పల్లి అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటానని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. సునీతకు వేసే ప్రతి ఓటు తనకు, తన పాలనకు వేస్తున్నట్టే భావించి, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ప్రభుత్వం తనపై కక్షగట్టి కొడంగల్లో ఓడిస్తే మల్కాజ్గిరి ప్రజలు తనను అక్కున చేర్చుకుని ఎంపీగా గెలిపించారని తెలిపారు. ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గ కార్యకర్తలు పడిన శ్రమ, ప్రజల ఆదరణ మర్చిపోలేనని అన్నారు. వారి రుణం తీర్చుకునే అవకాశం తనకు ఇప్పుడు వచ్చిందని తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, నియోజకవర్గ ఎనినకల కో ఆర్డినేటర్ వినయ్రెడ్డి, తదితరులున్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-02T00:44:14Z dg43tfdfdgfd