ఈత కొడుతూ కానిస్టేబుల్‌‌‌‌ మృతి

ఈత కొడుతూ కానిస్టేబుల్‌‌‌‌ మృతి

నస్పూర్, వెలుగు: స్విమ్మింగ్‌‌‌‌ పూల్‌‌‌‌లో ఈత కొడుతూ అస్వస్థతకు గురై ఓ కానిస్టేబుల్‌‌‌‌ చనిపోయాడు. మంచిర్యాల పట్టణంలో కానిస్టేబుల్‌‌‌‌గా పనిచేస్తున్న పంజాల సతీశ్ గౌడ్ (42) ఆదివారం తన ఇద్దరు పిల్లలను తీసుకొని సీసీసీలోని సింగరేణి స్విమ్మింగ్‌‌‌‌ పూల్‌‌‌‌కు వెళ్లారు. 

అక్కడ ఈత కొడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. సతీశ్‌‌‌‌గౌడ్‌‌‌‌ హైబీపీతోనే చనిపోయారని డాక్టర్లు చెప్పారు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీసీసీ ఎస్సై రవికుమార్‌‌‌‌ తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T03:15:08Z dg43tfdfdgfd