ఈవీఎం ర్యాండమైజేషన్లో పొరపాట్లు జరగవద్దు
వనపర్తి, వెలుగు: ఎన్నికల్లో కీలకమైన ఈవీఎంల ర్యాండమైజేషన్లో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. ఆదివారం చిట్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు గోదామ్లో ఈవీఎంలను తనిఖీ చేశారు. అనంతరం అసిస్టెంట్రిటర్నింగ్ ఆఫీసర్ ఎం నగేశ్ పర్యవేక్షణలో, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సెక్టార్ ఆఫీసర్లు ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రారంభించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాక్ పోలింగ్ నిర్వహించి పోలింగ్ డే కోసం ఈవీఎంలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-06T05:00:41Z dg43tfdfdgfd