ఎక్కడా జరగని పనిని రేవంత్ రెడ్డి సాధ్యమయ్యేలా చేశారు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో ప్రచారం జోరందుకుంది. నేతల మధ్య విమర్శలు కూడా అదే స్థాయిలో నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాదవశాత్తు ముఖ్యమంత్రి అయ్యారంటూ కీలక కామెంట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రేవంత్ రెడ్డి.. బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా అదే అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు.. భూమ్మీద ఎక్కడా జరగని పనిని రేవంత్ రెడ్డి సాధ్యమయ్యేలా చేశారని కిషన్ రెడ్డి పంచులు వేశారు. గాడిద అసలు గుడ్డే పెట్టదు కానీ.. సీఎం రేవంత్ రెడ్డి పెట్టించారంటూ సైటెర్లు వేశారు కిషన్ రెడ్డి. పార్టీ గుర్తు కన్నా.. గాడిద గుడ్డునే బాగా ప్రచారం చేస్తున్నారని.. ఇక నుంచి రేవంత్ రెడ్డి పార్టీ గుర్తు గాడిద గుడ్డు అంటూ తనదైన శైలిలో వ్యంగ్రాస్త్రాలు సంధించారు.

మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు లేకుండా చేయాలని కుట్ర చేస్తోందంటున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కిషన్ రెడ్డి. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను ఎవరూ తొలగించలేరని తేల్చిచెప్పారు. రాజ్యాంగాన్ని రద్దు చేయడం, రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచనే బీజేపీకి లేదంటూ స్పష్టం చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T12:51:31Z dg43tfdfdgfd