ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలి
బషీర్ బాగ్, వెలుగు : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ ఆరోపించింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించింది. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ యాదవ్, కన్వీనర్ బత్తుల కృష్ణ , కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి మాట్లాడుతూ.. 17 లోక్ సభ నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో న్యాయవాదులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు.
బీజేపీ పాలనలో ప్రజలకు ఓరిగిందేమీ లేదని, ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు లౌకికవాదానికి ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. నిత్యవసరాలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలను దోచుకున్నారని, సామాజిక న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో న్యాయవాదులంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి, బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధులు దుర్గాభవాని, అనురాధ, మంజుల, రాజేశ్, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-28T04:44:03Z dg43tfdfdgfd