ఏడాది చివరికల్లా నిఫ్టీ 25,810 లెవెల్కు : ప్రభుదాస్ లిల్లాధర్
న్యూఢిల్లీ: ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి నిఫ్టీ 25,810 లెవెల్ను టచ్ చేస్తుందని బ్రోకరేజ్ కంపెనీ ప్రభుదాస్ లీలాధర్ అంచనా వేస్తోంది. ఈ ఏడాది వర్షపాతం సాధారణంగా ఉంటుందని పేర్కొంది. ఇండియాలో పొలిటికల్ స్టెబిలిటీ నెలకొంటుందని, ఎకనామిక్ గ్రోత్ పుంజుకుంటుందని ఇండియా స్ట్రాటజీ రిపోర్ట్లో ఈ బ్రోకరేజ్ కంపెనీ పేర్కొంది.
బుల్లిష్ ట్రెండ్ కొనసాగితే నిఫ్టీ ఈ ఏడాది చివరి నాటికి 27,100 లెవెల్ను టచ్ చేస్తుందని, బేరిష్ ట్రెండ్ వస్తే 23,229 లెవెల్ దగ్గర ఆగుతుందని అంచనా వేసింది. బుల్లిష్ ట్రెండ్ ఉంటే 26,885 లెవెల్కు, బేరిష్ ట్రెండ్ ఉంటే 22,066 లెవెల్కు చేరుకుంటుందని గతంలో ప్రభుదాస్ లిల్లాధర్ అంచనా వేసింది. తాజాగా ఈ అంచనాలను సవరించింది.
ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియల్ ఎస్టేట్, హెల్త్కేర్ సెక్టార్లు నిఫ్టీ ర్యాలీని ముందుండి నడుపుతాయని ప్రభుదాస్ లిల్లాధర్ పేర్కొంది. మారుతి, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ఎల్టీఐమైండ్ట్రి, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా వంటి షేర్లపై పాజిటివ్గా ఉంది. ఎయిర్టెల్, ఏబీబీ, సీమెన్స్, ఎల్ అండ్ టీ షేర్లను కూడా రికమండ్ చేసింది.
©️ VIL Media Pvt Ltd. 2024-05-02T00:44:12Z dg43tfdfdgfd