ఏప్రిల్ 30న మోదీ..మే 1న అమిత్షా ..రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్ర నేతలు
హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 30న సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గ్ మండలం సిల్వర్గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. మే 1న హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్పరిధిలోని గౌలిపురాలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న రోడ్షోలో అమిత్ షా పాల్గొననున్నారు.
ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆదివారం రాజ్యవర్ధన్సింగ్రాథోడ్, సినీ నటి కుష్బూ వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని అందులో పేర్కొన్నారు. సోమవారం కొత్తగూడెం, మహబూబాబాద్, మల్కాజిగిరిలో నిర్వహించే బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని.. అదే రోజు రాత్రి పార్టీ నాయకులతో ఆయన సమావేశమవుతారని తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-28T02:13:39Z dg43tfdfdgfd