ఏప్రిల్ 30న మోదీ..మే 1న అమిత్​షా ..రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్ర నేతలు

ఏప్రిల్ 30న మోదీ..మే 1న అమిత్​షా ..రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్ర నేతలు 

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షా రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 30న సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గ్ మండలం సిల్వర్​గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. మే 1న హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్​పరిధిలోని గౌలిపురాలో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న రోడ్​షోలో అమిత్ షా పాల్గొననున్నారు.

ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​రెడ్డి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆదివారం రాజ్యవర్ధన్​సింగ్​రాథోడ్, సినీ నటి కుష్బూ వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని అందులో పేర్కొన్నారు. సోమవారం కొత్తగూడెం, మహబూబాబాద్, మల్కాజిగిరిలో నిర్వహించే బహిరంగ సభల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని.. అదే రోజు రాత్రి పార్టీ నాయకులతో ఆయన సమావేశమవుతారని తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-28T02:13:39Z dg43tfdfdgfd