ఓటును అమ్ముకుంటే శవంతో సమానం

ఓటును అమ్ముకుంటే శవంతో సమానం

  • జై భారత్​ జస్ట్​ ఓట్​ తెలంగాణ క్యాంపెయిన్​ కమిటీ  

ఖైరతాబాద్​​,వెలుగు:  ఎన్నికల్లో రాజకీయ నేతలు ఇచ్చే డబ్బు, మద్యానికి ఆశపడితే మరో ఐదేండ్ల పాటు మోసపోవడం ఖాయమని జై భారత్​గ్రేటర్​హైదరాబాద్​ముఖ్య కో – -ఆర్డినేటర్​ ఖదిజ్ఞాసి భాగవతుల ఆర్​ప్రసాద్​అన్నారు. జై భారత్​జస్ట్​ఓట్​తెలంగాణ క్యాంపెయిన్​ కమిటీ  ఆధ్వర్యంలో  ‘ ధన స్వామ్యాన్ని బద్దలు కొడదాం.. -ప్రజాస్వామ్యాన్ని నిలబెడదాం ’ పేరుతో ఆదివారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.  ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా పోటీచేసే అభ్యర్థుల అర్హత, నిబద్ధత,సమర్థత చూసి ఓటు వేయాలని సూచించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T03:45:14Z dg43tfdfdgfd