ఓటును అమ్ముకుంటే శవంతో సమానం
ఖైరతాబాద్,వెలుగు: ఎన్నికల్లో రాజకీయ నేతలు ఇచ్చే డబ్బు, మద్యానికి ఆశపడితే మరో ఐదేండ్ల పాటు మోసపోవడం ఖాయమని జై భారత్గ్రేటర్హైదరాబాద్ముఖ్య కో – -ఆర్డినేటర్ ఖదిజ్ఞాసి భాగవతుల ఆర్ప్రసాద్అన్నారు. జై భారత్జస్ట్ఓట్తెలంగాణ క్యాంపెయిన్ కమిటీ ఆధ్వర్యంలో ‘ ధన స్వామ్యాన్ని బద్దలు కొడదాం.. -ప్రజాస్వామ్యాన్ని నిలబెడదాం ’ పేరుతో ఆదివారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా పోటీచేసే అభ్యర్థుల అర్హత, నిబద్ధత,సమర్థత చూసి ఓటు వేయాలని సూచించారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-06T03:45:14Z dg43tfdfdgfd