ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : వికాస్ రాజ్

ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : వికాస్ రాజ్

ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో కలిసి MBGS బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు వికాస్ రాజ్. 

ఎండ కారణంగా ఓటర్లు ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఓటేసి.. పాలకులను ఎంచుకోవాలని సూచించారు వికాస్ రాజ్. ఓటరు ఆన్లైన్ ద్వారా తమ ఓటు ఉందొ లేదో చెక్ చేసుకోవాలని చెప్పారు. ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల ద్వారా ఎదో ఒకటి చూపించైన ఓటు హక్కు వినియోగించుకోవచ్చుని వికాస్ రాజ్ తెలపారు.  

ఓటుపై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఓటింగ్ శాతం పెరిగేలా ప్రతీ ఒక్కరూ పోలింగ్ లో పాల్గొనాలని.. యువత ముందుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు సజ్జనార్. ఎంజీబీఎస్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-04-20T12:46:44Z dg43tfdfdgfd