ఓటింగ్​పై అవేర్ నెస్.. ఉత్సాహంగా 5కె రన్

ఓటింగ్​పై అవేర్ నెస్.. ఉత్సాహంగా 5కె రన్

హైదరాబాద్, వెలుగు: స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజల భాగస్వామ్యంతో ఐ ఓట్ ఫర్ ష్యూర్ అన్న నినాదంతో 5కె రన్ నిర్వహించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన 5 కె  రన్ లో అధికారులు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్టూడెంట్లు, యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

ఈ నెల 13 న ఓటు వేయడం మర్చిపోవద్దని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేయాలని రన్ సందర్భంగా అధికారులు కోరారు. రన్ లో పాల్గొన్నోళ్లంతా తమ ఇంట్లోవాళ్లకు, చుట్టుపక్కలవాళ్లకు ఓటింగ్​పై అవహన కల్పించాలన్నారు. ఓటర్ జాబితాలో పేరును  చెక్ చేసుకోవాలని, పోలింగ్ కేంద్రాన్ని చూసుకోవాలని సూచించాలన్నారు. రన్ కార్యక్రమాల్లో అసిస్టెంట్ స్వీప్ నోడల్ ఆఫీసర్లు, డీపీవోలు, సీవోలు తదితరులు పాల్గొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T02:15:01Z dg43tfdfdgfd