కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్ .. ఒకరు మృతి

కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్ .. ఒకరు మృతి

  •  స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ శివారులోని మూలమలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు, మరో బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే నారాయణ రెడ్డి వెల్జాల్ గ్రామంలో ప్రచారం ముగించుకుని మిడ్జిల్ వైపు కారులో వస్తున్నారు. అదే టైంలో  తలకొండపల్లి మండలం వెంకటాపూర్​కు  చెందిన పబ్బతి నరేశ్(25), పరుశురాములు(35) స్వగ్రామానికి బైకుపై వస్తున్నారు.

 వెంకటాపూర్  శివారులోని రామాస్ పల్లి మైసమ్మ ఆలయం మూలమలుపు వద్ద ఎమ్మెల్యే కారు, బైకు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నరేశ్ అక్కడికక్కడే మృతిచెందగా..పరుశురాములు(35) తీవ్రంగా గాయపడ్డారు. కారులోని ఎయిర్ బెలూన్లు ఓపెన్ ​కావడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ పరుశురాములును కల్వకుర్తి దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T02:48:14Z dg43tfdfdgfd