కాంగ్రెస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా
ఉప్పల్, వెలుగు: మల్కాజిగిరి గడ్డ.. కాంగ్రెస్అడ్డా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉప్పల్శ్రీరస్తు ఫంక్షన్హాల్లో ఉప్పల్అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి భారీ మెజార్టీని అందించిన ఘనత ఇక్కడి ఓటర్లకు ఉందన్నారు. ఈసారి సునీతామహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఎన్నికల వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్పార్టీ గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. సమావేశంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగరెడ్డి హరివర్థన్రెడ్డి,ఉప్పల్, చర్లపల్లి, కాప్రా కార్పొరేటర్లు మందముల రజిత, బొంతు శ్రీదేవి, స్వర్ణరాజ్శివమణి, టీపీసీసీ ప్రతినిధి తొఫిక్, ఆగి రెడ్డి, మాజీ కార్పొరేటర్ పావనిరెడ్డి, సింగిరెడ్డి ధన్ పాల్ రెడ్డి పాల్గొన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-03-29T02:28:18Z dg43tfdfdgfd