కాంగ్రెస్ పార్టీలో నేనింకా చేరలేదు : కడియం శ్రీహరి
కాంగ్రెస్ పార్టీలో తాను ఇంకా చేరలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాను వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం అంటూ వస్తున్న వార్తలపై కడియం మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు తనను కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించారని చెప్పుకోచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ను బలోపేతం చేయాలని కోరారన్నారు. శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం చెబుతానన్నారు కడియం. కాంగ్రెస్లో చేరే అంశంపై ఒకటి, రెండు రోజుల్లో కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం చెబుతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అనేక కారణాల వల్ల బలహినపడిందన్నారు కడియం.
మరోవైపు కాంగ్రెస్ నేతలు దీపాదాస్ మున్షీ, రోహిత్ చౌదరీ, విష్ణునాథ్ కడియం ఇంటికి వెళ్లారు. కడియం శ్రీహరిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు దీపాదాస్ మున్షీ వెల్లడించారు. ఇకా నిన్న వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించారు. ఈ మేరకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ క్రమంలో కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ కూడా ఇంతవరకు ప్రకటించలేదు.
©️ VIL Media Pvt Ltd. 2024-03-29T09:13:57Z dg43tfdfdgfd