కాంగ్రెస్ ప్రజాపాలనను అందిస్తోంది
వెల్గటూర్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలనను అందిస్తోందని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం, తాళ్లకొత్తపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి ముచ్చటించారు. 10 ఏళ్లుగా ముంపు గ్రామాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆయనతో గోడు వెళ్లబోసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు కూడా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందేలా చూస్తామన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ చొరవతో ముంపు గ్రామాల్లో రూ.40 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-02T03:44:42Z dg43tfdfdgfd