కాంగ్రెస్ మళ్లీ మోసం చేస్తోంది..నామా నాగేశ్వరరావు

కాంగ్రెస్ మళ్లీ మోసం చేస్తోంది..నామా నాగేశ్వరరావు

అశ్వారావుపేట, వెలుగు : కాంగ్రెస్ ఆరు హామీలు నెరవేర్చకపోగా మాయమాటలతో మళ్లీ మోసం చేసేందుకు చేస్తోందని ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ సెంటర్​లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపించారన్నారు.

ఇక్కడి పామాయిల్ రైతులను దృష్టిలో ఉంచుకొని 90 టన్నుల సామర్థ్యం గల ఫ్యాక్టరీని నిర్మిస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, ములకలపల్లి జ్పడీటీసీ సున్నం నాగమణి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, సూర్య ప్రకాశ్​రావు, తాడేపల్లి రవి పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T04:22:38Z dg43tfdfdgfd