కాంగ్రెస్ మేనిఫెస్టోతో యువతకు లాభం
వనపర్తి, వెలుగు: నిరుద్యోగులు, యువతకు ప్రొఫెషనల్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఎంతో ఉపయోగపడుతుందని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఏఐపీసీ స్టేట్ టీమ్ ఇన్చార్జి నావికా హార్సె తెలిపారు. సోమవారం ఓ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులు, యువతను ఏ విధంగా మోసం చేసిందో డిజిటల్ స్క్రీన్ ద్వారా వివరించారు. నాగర్కర్నూల్ ఎంపీగా మల్లురవిని గెలిపించాలన్నారు. జిల్లెల ఆదిత్య రెడ్డి, ఏఐపీసీ స్టేట్ టీం మెంబర్స్ రాహుల్ రెడ్డి, ఇర్ఫాన్, కార్తీక్ రెడ్డి, జిల్లా కో ఆర్డినేటర్ నాగిరెడ్డి వంశీ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి, గణేశ్ గౌడ్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు రోహిత్ పాల్గొన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-07T03:48:23Z dg43tfdfdgfd