కేంద్ర ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోంది : కోదడంరాం

కేంద్ర ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోంది : కోదడంరాం

కామారెడ్డి ​, వెలుగు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తోందని టీజేఎస్​ ప్రెసిడెంట్​ప్రొఫెసర్​ కోదండరాం విమర్శించారు.  బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో  'ప్రమాదంలో ప్రజాస్వామ్యం- '  బహిరంగ చర్చ ప్రొగ్రాం నిర్వహించారు.  ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ..  కాకతీయ యూనివర్సిటీలో  కవులు, రచయితలపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు.   పెట్రోల్​, డిజీల్‌ రేట్లు అధికంగా పెంచడంతో సామాన్యుల మీద భారం పడుతోందన్నారు.  

ఈ సారి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగానికి , దేశానికి ప్రమాదమన్నారు.  మతం పేరుతో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.   ఇలాంటి విధానాల్ని  ఐక్యంగా ఉండి తిప్పి కొట్టాలన్నారు.  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో  నిరంకుశ  కేసీఆర్​ ప్రభుత్వాన్ని ఓడించినట్లే ఈ ఎంపీ ఎన్నికల్లో  బీజేపీని ఓడించాలన్నారు.  టీజేఎస్​ స్టేట్​జనరల్ సెక్రెటరీ నిజ్జన రమేశ్,  జేఎసీ జిల్లా కన్వీనర్​ జగన్నాథం, డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు, యూత్​ కాంగ్రెస్​ జిల్లా ప్రెసిడెంట్​ఇలియాజ్​అలీ,  ప్రతినిధులు శ్రీహరిరావు, మోహన్​రెడ్డి, చందు, వెంకటిగౌడ్​, దశరథ్​, మోతిరాం, జహీరాబాద్​ ఎంపీ కాంగ్రెస్​ అభ్యర్థి కూతురు గిరిజ షెట్కార్,  తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T03:59:43Z dg43tfdfdgfd