కేజ్రీవాల్ కు బిగ్ షాక్.. కస్టడీ పొడగింపు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కస్టడీని పొడిగిస్తున్నట్టు రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. మే 20 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయనకు విధించిన కస్టడీ ఈ రోజు ముగియడంతో మరోసారి కస్టడీని పొడిగించింది.
మరోవైపు తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రివాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. కేజ్రీవాల్ ను మార్చి 21, 2024 న ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీని ఎదుర్కొంటున్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-07T09:49:18Z dg43tfdfdgfd