Weather Report: నేడు భగ్గుమనేలా ఎండలు.. ఏపీ, తెలంగాణ వాతావరణ రిపోర్ట్
నిన్న ఇండియాలోనే అత్యధిక ఉష్ణోగ్రత మన కోస్తాంధ్రలోని రెంటచింతలలో 46.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ విషయాన్ని భారత వాతావరణ విభాగం (IMD) చెప్పింది. రాయలసీమలో మే 3 తర్వాత ఎండల వేడి కొంత తగ్గుతుందనీ, అప్పటివరకూ రాయలసీమలో అతి తీవ్ర హీట్ వేవ్ పరిస్థితి తప్పదని చెప్పింది. తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో వచ్చే 4, 5 రోజులపాటూ హీట్ వేవ్ పరిస్థితి ఉంటుందని తెలిపింది. శాటిలైట్ అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇవాళ ఉదయం తీర ప్రాంత జిల్లాలపై మేఘాలు ఉంటాయి. కానీ ఉదయం 7 తర్వాత అవి మామయవుతాయి. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అంతటా భగ్గుమనే ఎండలు ఉంటాయి. మధ్యాహ్నం 3 తర్వాత కోస్తా, గుంటూరు ప్రాంతంలో జల్లులు పడే ఛాన్స్ కొద్దిగా ఉంది. అలాగే తిరుపతిలో కూడా అదే సమయంలో జల్లులు పడతాయి. సాయంత్రం 4 తర్వాత తిరుపతి, తిరుమలలో కొద్దిగా వాన పడేలా కనిపిస్తోంది. ఆ తర్వాత దక్షిణ రాయలసీమలో కొద్దిగా మేఘాలు ఉంటాయి. రాత్రి 12 తర్వాత ఎక్కడా మేఘాలు లేవు. గాలిని గమనిస్తే, బంగాళాఖాతంలో గంటకు 16 నుంచి 43 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. ఏపీలో గంటకు 8 నుంచి 17 కిలోమీటర్ల వేగంతో ఇవాళ గాలులు వీస్తాయి. తెలంగాణలో గంటకు 5 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం ఇండియాలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ దేశం మొత్తం భరించలేని ఎండ ఉంటుంది. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రత చూస్తే.. తెలంగాణలో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ ఉండేలా కనిపిస్తోంది. హైదరాబాద్ కూడా ఇవాళ భరించలేని విధంగా ఉంటుంది. ఏపీలో కూడా ఇవాళ ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా ఉంటాయి. 39 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని మ్యాప్స్ చెబుతున్నాయి. తేమ పెద్దగా లేదు. పశ్చిమ తెలంగాణ, పశ్చిమ రాయలసీమలో ఎండ అత్యంత ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. అందువల్ల ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇవాళ నీరు బాగా తాగాలి, పండ్ల రసాలు తీసుకోవాలి, నీడలో ఉండేందుకు ప్రయత్నించాలి, తలనొప్పి రాకుండా చూసుకోవాలి. అన్ని జాగ్రత్తలూ తీసుకుందాం. (All Images credit - IMD)
2024-05-02T00:31:44Z