కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

  • పిల్ వేసిన లా స్టూడెంట్​కు పెనాల్టీ విధించిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. లా స్టూడెంట్ వేసిన ఈ పిటిషన్ ను కొట్టేస్తూ ఆయనకు రూ.75వేల జరిమానా విధించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్ జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఓ లా స్టూడెంట్ పిల్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ పీఎస్ అరోరాతో కూడిన బెంచ్ విచారించింది. ఈ పిల్ పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందంటూ, మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-23T02:54:29Z dg43tfdfdgfd