కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపోళ్లు ఒక్కటయ్యారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలంపూర్ లో జనజాతర సభలో మాట్లాడిన రేవంత్.. ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందన్న రేవంత్... హామీలు అమలవుతున్నాయో లేదో తెల్వాలంటే కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కి.. హైదరాబాద్ నుంచి జోగులాంబకు రావాలి.. ఫ్రీ టికెట్ ఇస్తే హామీలు అమలైనట్లు అని అన్నారు. జోగులాంబ సాక్షిగా మే 9 వరకు రైతుభరోసా పూర్తి చేస్తాం.. పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేసి రైతుల రుణం తీసుకుంటానని చెప్పారు. కార్ఖానాకు పోయిన కారు తిరిగి రాదని.. కారును తూకం వేయాల్సిందేనన్నారు రేవంత్.
నడిగడ్డ పౌరుషానికి పెట్టింది పేరన్న రేవంత్.. నడిగడ్డ బిడ్డ మాటిస్తే నిలబెట్టుకుంటారని చెప్పారు. బంగ్లా రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలికి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. డీకే అరుణమ్మ కడుపులో కత్తులు పెట్టుకుని కాంగ్రెస్ ను చంపాలని చూస్తోందని మండిపడ్డారు. భరత సింహారెడ్డి దందాలు చేసి వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. అధికారం అండతో డీకే అరుణ వేల కోట్లు సంపాదించుకోలేదా? అని ప్రశ్నించారు. డిసెంబర్ లో జరిగిన సెమీఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించాం.. మే 13న జరగబోయే ఫైనల్స్ లో గుజరాత్ ను ఓడించి తెలంగాణను గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్.. బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. మల్లురవిని లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-05T12:27:49Z dg43tfdfdgfd