కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

 కొండగట్టు, వెలుగు: కొండగట్టుకు హనుమాన్‌‌ దీక్షాపరులు, భక్తులు తరలివచ్చారు. హనుమాన్​ జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచే దీక్షాపరులు గుట్టకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయంలో స్వామిని పండ్లతో అలంకరించారు. దీక్షామండపంలో మాలవిరమణ చేసిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. నేటితో హనుమాన్  చిన్న జయంతి వేడుకలు ముగుస్తాయి. అంజన్నను ఎండోమెంట్  కమిషనర్  హనుమంతరావు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T04:43:26Z dg43tfdfdgfd