కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో టాస్క్ఫోర్స్ దాడులు
హైదరాబాద్, వెలుగు: కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ వద్ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టాస్క్ ఫోర్స్ బృందం శుక్రవారం తనిఖీలు చేపట్టింది. నిషేధిత పద్ధతుల్లో మామిడికాయలను పండించి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు.
పక్వానికి రాకముందే కృత్తిమంగా ఇథిలీన్ కలిపి పండిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 550 కిలోల మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. ఇటువంటి పండ్లతో ప్రజాఆరోగ్యం దెబ్బతింటుందని, సరైన పద్ధతుల్లో పండించిన పండ్లను మాత్రమే విక్రయించాలని సూచించారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-27T03:54:58Z dg43tfdfdgfd