కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం
ఖైరతాబాద్,వెలుగు: కరోనా సమయంలోఎమర్జెన్సీ పేరుతో క్లినికల్ట్రయిల్స్ లేకుండానే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో వ్యాక్సిన్ వేసుకున్న వారిలో దుష్ప్రభావం ఇప్పటికీ ఉందని అవేకెన్ ఇండియా మూమెంట్ సలహాదారు దొంతి నరసింహారెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యురాలు సరస్వతి కవుల, డాక్టర్లు సుధ, సక్సేనా, సురేందర్ రాజు ఆరోపించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో గుండెపోటు, క్యాన్సర్, నరాల వ్యాధులు వంటివి వస్తున్నాయన్నారు. ఇప్పటికే చాలామంది మృతి చెందారని, వారికి కేంద్ర ప్రభుత్వంతో పాటు వ్యాక్సిన్ తయారీ సంస్థ నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వంతో పాటు వ్యాక్సిన్ ను ప్రమోట్ చేసిన సెలబ్రెటీలు కూడా సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-07T03:03:18Z dg43tfdfdgfd