కోడ్ ఉల్లంఘన.. రాజాసింగ్​పై కేసు

కోడ్ ఉల్లంఘన.. రాజాసింగ్​పై కేసు

ఖానాపూర్, వెలుగు: ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై ఖానాపూర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశామని స్థానిక ఎస్సై లింబాద్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం రాత్రి ఖానాపూర్​లో రాజా సింగ్.. బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేశ్  తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. 

ప్రచార సమయం దాటినా రాజా సింగ్  తన ప్రసంగాన్ని కొనసాగించారని ఎన్నికల అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ప్రచారంలో పాల్గొన్న ఆదిలాబాద్  ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి నగేశ్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్  అంకం మహేందర్ పైనా కేసు రిజిస్టర్  చేశామని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-10T02:36:31Z dg43tfdfdgfd