గుజరాత్ బరిలో 35 మంది ముస్లిం క్యాండిడేట్లు
అహ్మదాబాద్: గుజరాత్ లో మొత్తం 26 లోక్ సభ స్థానాలకు గాను 25 స్థానాల్లో ఈ సారి 35 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2019లో 43 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి ముస్లిం వర్గానికి చెందిన చాలా మంది ఇండిపెండెంట్లుగా, చిన్న చిన్న పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. ఈ నెల 7న పోలింగ్ జరగనున్న గాంధీనగర్ నియోజకవర్గంలో బీఎస్పీ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టింది.
అయితే, గుజరాత్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం చైర్మన్ వజీర్ ఖాన్ మాట్లాడుతూ.. తమ పార్టీ తరఫున భరూచ్ నియోజకవర్గం నుంచి ప్రతి ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థిని నిలబెట్టిందని, ఈసారి ఆ సీటు ఆప్కు వెళ్లడంతో అది సాధ్యం కాలేదన్నారు. ప్రతిసారి ముస్లిం అభ్యర్థిని నిలబెట్టే భరూచ్ లోక్సభ స్థానం కూడా ఒప్పందంలో భాగంగా ఆప్కు వెళ్లిందని కాంగ్రెస్ తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-06T02:30:04Z dg43tfdfdgfd