గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం

గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం

భద్రాచలం, వెలుగు : మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో మావోయిస్టులు డంప్‌ చేసిన పేలుడు పదార్థాలను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా టిఫాగడ్‌ అడవుల్లో మావోయిస్టులు పేలుడు పదార్థాలు డంప్​ చేశారన్న సమాచారంతో సీ-60, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అడవిలోకి వెళ్లాయి. 

పేలుడు పదార్థాలు నింపిన ఆరు ప్రెషర్‌ కుక్కర్లు, మూడు డిటోనేటర్లు, మూడు క్లైమోర్‌మైన్స్‌, గన్‌ పౌడర్‌తో ఉన్న ప్లాస్టిక్​ బ్యాగ్‌, మందులు, దుప్పట్లు గుర్తించి బాంబ్‌ స్క్వాడ్‌కు సమాచారమిచ్చారు. వారు వచ్చి పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. కూంబింగ్‌కు వచ్చే భద్రతాబలగాలపై దాడి చేసేందుకు ఈ పేలుడు పదార్థాలను డంప్‌ చేసినట్లు సమాచారం. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T03:18:17Z dg43tfdfdgfd