గడ్డం వంశీకృష్ణ గెలుపుతో అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి

గడ్డం వంశీకృష్ణ గెలుపుతో అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి

కోల్ బెల్ట్, వెలుగు: పెద్దపెల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం మంచిర్యాలలో జైపూర్ మండలం నర్సింగపూర్, మద్దులపల్లి గ్రామాలకు చెందిన బీఆర్​ఎస్ లీడర్లు వేముల శ్రీనివాస్ గౌడ్, మోహన్ గౌడ్, బోయిని మల్లేశ్​తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వివేక్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు కల్పించే విజన్ కలిగిన యువకుడు, విద్యావంతుడు వంశీకృష్ణను ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ చల్లా సత్యనారాయణ రెడ్డి, షేట్ పల్లి ఎంపీటీసీ బోయిని స్వాతి సంపత్, సొల్లూరి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T03:28:09Z dg43tfdfdgfd